Tue Oct 15 11:24:54 UTC 2024: ## పైడితల్లి ఆలయంలో పండుగ వాతావరణం: అశోక్ గజపతి, కలిశెట్టి పూజలు నిర్వహించారు

విజయనగరం, అక్టోబర్ 14: శ్రీ పైడితల్లి అమ్మవారి తొలేళ్ల సంబరం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. పులివేషాలు, కర్ర‌సాము, క‌త్తిసాము, విచిత్ర వేషాలతో పట్టణంలో సంద‌డి నెల‌కొంది. అమ్మ‌వారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు బారులు తీరారు.

మాన్సాస్ ఛైర్మ‌న్‌, కేంద్ర మాజీ మంత్రి పూస‌పాటి అశోక్‌గ‌జ‌ప‌తిరాజు, ఎమ్మెల్యే అదితి విజ‌య‌ల‌క్ష్మి గ‌జ‌ప‌తిరాజు కుటుంబ స‌భ్యులు అమ్మ‌వారిని ద‌ర్శించుకుని ప‌ట్టువ‌స్త్రాల‌ను స‌మ‌ర్పించారు. ఆల‌య అధికారులు, పూజారులు వారికి అధికార లాంఛ‌నాల‌తో స్వాగ‌తం ప‌లికారు.

ఎంపీ క‌లిశెట్టి అప్ప‌ల‌నాయుడు స‌తీస‌మేతంగా అమ్మ‌వారిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

నగరం ప్ర‌ధాన ర‌హ‌దారులు భ‌క్తుల‌తో నిండిపోయాయి. వివిధ ప్రాంతాల నుంచి ప‌ట్ట‌ణానికి భ‌క్తుల రాక మొదలైంది. ఘ‌టాల‌తో, అమ్మ‌వారి నామ స్మ‌ర‌ణ‌తో నగరం మారుమ్రోగింది.

Read More