Tue Oct 15 05:50:00 UTC 2024: ## హైకోర్టు క్లియర్ చేసింది.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్
**హైదరాబాద్:** తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. దీంతో ఈ నెల 21 నుంచి యథావిధిగా మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై అభ్యర్థులు అనేక పిటిషన్లు దాఖలు చేశారు. ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ, రిజర్వేషన్ల జీవో 33, తదితర అంశాలపై పిటిషన్లు దాఖలు చేశారు.
హైకోర్టు పిటిషన్లను డిస్మిస్ చేయడంతో మెయిన్స్ పరీక్షకు అడ్డంకి తొలిగింది. ఇక గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కోసం టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. 31,382 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాయనున్నారు.