
Vijayawada Floods : గత రెండు రోజులు కురుస్తోన్న భారీ వర్షాలకు విజయవాడ అతలాకుతలం అయ్యింది. నిన్న ఒక్క రోజే 29 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలకు నగర జీవనం అస్తవ్యస్తం అయ్యింది. కవులూరు వద్ద బుడమేరు కట్ట తెగి వరదనీరు కాలనీల్లోకి ప్రవేశిస్తుంది.విజయవాడ నగరంలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా.. ఒకేరోజు(శనివారం) 29 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం నుంచి విజయవాడలో కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. అపార్ట్మెంట్ల సెల్లార్లలోకి వర్షపు నీరు చేరి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజ రాజేశ్వరిపేట వరద నీటిలో చిక్కుకుంది.సరిగ్గా 20 ఏళ్ల తర్వాత విజయవాడ నగరం ముంపునకు గురైంది. రికార్డు స్థాయిలో ఎగువన ఖమ్మం జిల్లా నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో అదంతా విజయవాడను ముంచెత్తింది.తాజాగా బుడమేరు పొంగడంతో సింగ్నగర్, చిట్టీనగర్, ఇతర కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాల కారణంగా కొండ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Vijayawada Floods : విజయవాడను చుట్టుముట్టిన వరద – ప్రధానమైన 10 …
Vijayawada Floods : విజయవాడను చుట్టుముట్టిన వరద - ప్రధానమైన 10 ...