Sun Nov 10 09:46:06 UTC 2024: ## పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎక్స్లో ట్రంప్కు అభినందనలు – నిషేధం నేపథ్యంలో వివాదం
**ఇస్లామాబాద్:** పాకిస్థాన్లో నిషేధించిన సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్కు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అభినందనలు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట వివాదాస్పదంగా మారింది.
ప్రస్తుతం పాకిస్థాన్లో ఎక్స్ పై నిషేధం కొనసాగుతుండటం గమనార్హం. షెహబాజ్ ఎక్స్ను వినియోగించడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎక్స్ను పునరుద్ధరించడకుండా దేశ ప్రధానే దాన్ని వినియోగించడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.
షెహబాజ్ తన పోస్ట్లో ‘రెండోసారి చరిత్రాత్మక విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్నకు అభినందనలు. పాకిస్థాన్- అమెరికా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి రాబోయే పాలకులతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాను’ అని రాసుకొచ్చారు.
పాకిస్థాన్లో ఎక్స్ నిషేధాన్ని గుర్తుచేస్తూ ఈ పోస్ట్కు ‘కమ్యూనిటీ నోట్స్’ను యాడ్ చేయడంతో ఈ విషయం వైరల్గా మారింది. షెహబాజ్ వీపీఎన్ ద్వారా ఎక్స్ని యాక్సెస్ చేసినట్లు పేర్కొంది.
ఈ ఏడాది ప్రారంభంలో జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్ సామాజిక మాధ్యమం ఎక్స్ను నిషేధిస్తున్నట్లు ఆ దేశ సమాచార మంత్రి ప్రకటించారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఉగ్రవాదులు తమ దేశ వ్యతిరేక కార్యకలాపాలను వ్యాప్తి చేసేందుకు ఈ మాధ్యమాన్ని ఉపయోగిస్తున్నట్లు ఆరోపించారు.