Tue Oct 15 08:30:00 UTC 2024: ## బండి సంజయ్ కేటీఆర్పై ఫైర్: నేవీ రాడార్ కేంద్రానికి ఎందుకు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు
**హైదరాబాద్:** బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. వికారాబాద్ నేవీ రాడార్ కేంద్రానికి మీరే అనుమతిచ్చి మీరే ఎలా వ్యతిరేకిస్తారని ప్రశ్నించారు.
“కేటీఆర్.. మీ అయ్య ఫాంహౌజ్ ముందు ధర్నా చేయ్. ఆనాడు రాడార్ వ్యవస్థకు ఎందుకు అనుమతి ఇచ్చారో అడుగు. మీ అయ్య ఆనాడు సోయిలో ఉండే ఆమోదం తెలిపారో లేదో అడుగు. మీరే అనుమతి ఇచ్చి మీరే వ్యతిరేకిస్తారా? దేశ భద్రత వ్యవస్థ ఏర్పాటును వ్యతిరేకించడమంటే.. దేశ ప్రయోజనాలను వ్యతిరేకించినట్లే,” అని బండి సంజయ్ ఆరోపించారు.
వికారాబాద్ దామగుండంలో నేవీ ఏర్పాటు చేయనున్న వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ మంగళవారం(అక్టోబర్ 15) శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండిసంజయ్ తదితరులు పాల్గొన్నారు.
రాడార్ కేంద్రానికి అనుమతి ఇచ్చినది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఇప్పుడు దానిని వ్యతిరేకిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు.