
Sat Oct 12 02:03:28 UTC 2024: ## తెలంగాణ ప్రభుత్వం టీమ్ ఇండియా క్రికెటర్ సిరాజ్కు డీఎస్పీ పోస్టును కేటాయించింది
హైదరాబాద్: టీమ్ ఇండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్కు తెలంగాణ ప్రభుత్వం డీఎస్పీ పోస్టును కేటాయించింది. రాష్ట్ర డీజీపీ జితేందర్ సిరాజ్కు డీఎస్పీ నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా సిరాజ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలోనే జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 78లో 600 చదరపు గజాల స్థలాన్ని సిరాజ్కు కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
టీ20 వరల్డ్కప్ 2024 గెలిచిన తర్వాత హైదరాబాద్ చేరుకున్న సిరాజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తన నివాసంలో కలిశారు. సీఎం సిరాజ్ను ఘనంగా సన్మానించి, క్రికెట్లో భారత్కి, తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవాన్ని తెచ్చాడంటూ సిరాజ్ను అభినందించారు.
కాగా, సిరాజ్తో పాటు తెలంగాణ స్టార్ ప్లేయర్స్ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఈషా సింగ్లకు కూడా ప్రభుత్వం ఇంటి స్థలం, గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఆఫర్ చేసింది. ఇటీవల బాక్సర్ నిఖత్ జరీన్ డీఎస్పీ(స్పెషల్ పోలీస్) గా నియామక పత్రాలు అందుకుంది.